నిరంతరం లోక సంచారం చేస్తూ ఆయా ప్రాంత విశేషాలను అందరికి తెలుపుతూ, ఏమైనా సమస్యలుంటే వాటిని గుర్తించి ఎవరి ద్వార పరిష్కరించవచ్చో వాళ్ళ దృష్టికి తీసుకొనివెళ్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపిన దేవర్షి నారదుడి లాగే సమాజ హితం కోసం నేటి పాత్రికేయులు పనిచేస్తున్నారని శ్రీ రాక సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్, జమ్మూ & కాశ్మీర్ స్టడీ సెంటర్ రాష్ట్ర కార్యదర్శి, అభిప్రాయపడ్డారు.