social media
‘సోషల్ మీడియా ద్వారా భారతీయ సంస్కృతి, చరిత్ర పట్ల అవగాహన’ అంశం మీద జరిగిన సమాలోచనలో భాగంగా మాట్లాడిన ప్రముఖ సోషల్ మీడియా కార్యకర్త శ్రీమతి పద్మ పిళ్ళై, చరిత్ర వక్రీకరణ వంటి సోషల్ మీడియా దాడులను ఎదుర్కోవాలంటే అందరూ నిజమైన చరిత్ర పట్ల అవగాహనా కలిగి ఉండాలని, అప్పుడే ఈ విధమైన దాడులకు సరియైన ఆధారాలతో సహా ధీటైన సమాధానాలు ఇవ్వగలుగుతామని తెలిపారు.
భారతీయ సంస్కృతి దృడంగా ఉన్నపుడే మనతో పాటు ప్రపంచం సుఖ సంతోషాలతో ఉండగలుగుతుంది అని విశ్వసించి, తాను పుట్టిన దేశాన్ని (ఐర్లాండ్) వదిలి భారత దేశాన్ని కన్న తల్లిగా భావించి జీవితాన్ని ధారపోసిన నిస్వార్ధ మహిళ సోదరి నివేదిత. ఆమె జీవితం అందిరికి స్పూర్తిదాయకం. స్వాతంత్రానికి పూర్వం ఉన్న ప్రతీకుల పరిస్తితులకు సైతం ఎదుర్కొని మహిళా చైతన్యం కొరకు విద్య, సేవ ప్రధానం అని ఆ దశలో పని చేసిన గొప్ప దేశ భక్తురాలు అని, ఆచార్య పి. సుమతి నాగేంద్ర గారు తెలిపారు.