స్థలం : #శ్రీనగర్ (# కాశ్మీర్ )
శత్రువులు అతి వేగంగా సమీపిస్తున్నారు. కాశ్మీర్ కి సైనిక సహాయం అంత్యంత అవసరం.ఎట్టి పరిస్థితులలోను శ్రీనగర్ విమానాశ్రయము శత్రువుల చేత చిక్కకూడదని డిల్లీ లోని సైనిక కార్యాలయము నుండి సందేశము వచ్చింది. పట్టణం శత్రువుల చేతచిక్కినా పరవాలేదు కానీ, విమానాశ్రయము ఎట్టి పరిస్థితులలో కూడా శత్రువు చేత చిక్కకూడదని సందేశం.
“విమానాశ్రయం పూర్తిగా మంచుతో కప్పబడియున్నది. విమానాలు దిగడము చాలా కష్టం” అని శ్రీనగర్ నుండి ప్రత్యుత్తరము వచ్చింది.
“అత్యవసరముగా కూలీలను పెట్టి మంచును తొలగించండి, ఎంత మంది కూలీలను నియోగించిన సరే, ఎంత ఖర్చయినా సరే, ”
“కూలీలు దొరకడం లేదు. ముస్లిం కూలిలపై ఇటువంటి సమయంలో భరోసా ఉంచలేము.”
ఇటువంటి సమయములో సైన్యాధ్యక్షుడికి సంఘ్ గుర్తు వచ్చింది.
అప్పుడు రాత్రి 11 గంటలయింది. ఒక సైనిక వాహనము సంఘ కార్యాలయము ముందు వచ్చి నిలిచింది. దానిలోనుండి ఒక అధికారి దిగారు.
కార్యాలయములో ప్రముఖ స్వయంసేవకుల సమావేశము జరుగుతున్నది. ప్రేమనాథ్ డోగ్రా మరియు అర్జున్ జీ లు అక్కడే ఉన్నారు..
సైన్యాధికారి పరిస్థితిని వివరించారు. అటు పిమ్మట “మీరు విమనాశ్రయము లో పేరుకున్న మంచును తొలగించే పని చేయగలరా?” అని అడిగారు.
“తప్పకుండా! ఎంత మంది సహాయకులు కావాలి?” అని అర్జున్ జీ అడిగారు.
“కనీసం 150 మంది కావాలి, వారితో 3,4 గంటలలో మంచు తొలగించగలము”
“మేము 600 మంది స్వయంసేవకులను సమకూర్చగలము” అని అర్జున్ జీ అన్నారు.
“ఇంత రాత్రి వేళ ఇంతమందా….” అని సైన్యాధికారి ఆశ్చర్యపోయారు.
“మీరు మమ్మలిని తీసుకుని వెళ్ళడానికి వ్యవస్థ చేయండి. 45 నిమిషాలలో మేము తయారుగా వుంటాము.”
సంఘ పద్ధతి ప్రకారము అనుకున్న సమయానికి 600 మంది తయారై కలసి వెళ్ళిపోయారు.
“మంచును తొలగించే పని ప్రారంభమయింది. విమానాలు ఎప్పుడయినా రావచ్చును.” అని డిల్లీ కి సందేశం పంపబడింది.
“ఇంత తొందరగా కూలీలు దొరికారా”
“అవును, కాని కూలీలు కారు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ సభ్యులు.”
రాత్రి గం.1.30 ని. లకు వారు పనిలో దిగారు. అక్టోబర్ 26 వ తేదీ ఉదయం 1వ సిఖ్ రేజిమెంటు కు చెందినా 329 మంది సైనికులు విమానము నుండి శ్రీనగర్ లో దిగి అత్యంత ప్రేమతో స్వయంసేవకులను ఆలింగనము చేసుకున్నారు. తర్వాత ఏముంది, ఒకటి తర్వాత ఒకటి 8 విమానాలు దిగాయి.
వాటన్నిటిలో అస్త శస్త్రాలు ఉన్నాయి. స్వయంసేవకులు వాటిని దించి నిర్దేశించిన స్థలములో ఉంచడానికి సహాయము చేశారు.
విమానాశ్రయం శత్రువుల చేతిలో చిక్కకుండా రక్షింపబడింది. దాని వలన మనకు యెనలేని లాభం కలిగింది.
విమాన బాట (రన్వే) ని కూడా వెడల్పు చేయవలసి రావడము వలన విశ్రమించకుండా స్వయంసేవకులు వెంటనే పనిలోకి దిగారు.
ఆధారం: న ఫూల్ చడే న దీప్ జలే (పుస్తకం)
!! నమస్తే సదా వత్సలే మాత్రు భూమే !!
!! భారత్ మాతా కీ జై!!