ఎవరికైనా అవసరానికంటే ఎక్కువ భూమి ఉందా అని అడిగే వారు. ఎవరైనా ఈ భూమి లేని వారికి భూమి ఇవ్వగలరా అని తర్వాతి ప్రశ్న వేసేవారు అలా ప్రతి గ్రామంలో ప్రయత్నం చేసి దాదాపు రెండున్నర లక్షల ఎకరాల భూమిని తెలంగాణలో సేకరించారు. దీనిలో కేవలం పాలమూరు జిల్లాలోని 40 వేల ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. కమ్యూనిస్టులు దశాబ్దాలుగా వర్గ శత్రు నిర్మూలన, బూర్జువా, పెట్టుబడిదారీ, భూస్వాములు, అని మాట్లాడుతూ ఒక్క ఎకరం భూమి కూడా పేదవాళ్లకు ఇప్పించ లేకపోయారు. ఈ పనిని రక్తపు చుక్క చిందించకుండా మనస్ఫూర్తిగా ఆ ఊర్లో ఉన్న పేదవాళ్లను ఊర్లో ఉన్న భూస్వాముల ద్వారా ఆదుకునే ప్రయత్నాన్ని చేసి చూపించారు. నక్సలైట్లు, కమ్యూనిస్టులు చేయలేని పనిని హిందూ ఆధ్యాత్మిక కోణం ద్వారా చేసి చూపించారు. గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యాన్ని సర్వోదయ ఉద్యమాన్ని జయప్రకాశ్ నారాయణ తో కలిపి ముందుకు తీసుకెళ్లారు. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ది చెందుతుందని అన్నారు. గ్రామ స్వరాజ్య సాధనకు ప్రతి గ్రామంలో దీనులకు హాస్టల్, గ్రామ స్వరాజ్య కేంద్రాలు, సర్వోదయ మండలి, హరిజన సేవక్ సంఘ్, గిరిజన సేవ సంఘం, హిందీ ప్రచార సమితి, రచనాత్మక సమాజ , గాంధీ జ్ఞాన ప్రతిష్టన్, ప్రారంభం చేసి ముందుకు తీసుకెళ్లారు ఒక రకంగా చెప్పాలంటే నేడు సంఘము వివిధ సామాజిక జీవన రంగాల్లో చేస్తున్నట్టుగానే నాడు భారతదేశంలో గాంధేయవాదం ఆధారంగా హిందూ జీవన విలువల ఆధారంగా వివిధ రకాల సంస్థలను, నిర్వహించారు చనిపోవడానికి అంటే ముందు దేశంలో గో రక్షణ చట్టం తీసుకు రావడానికి ఉపవాస దీక్ష కూడా వినోభా చేశారు. గోవులు అంటేఆయనకు అమితమైన ప్రేమ. నాగపూర్ పక్కన వార్ధా లో ఉన్న సేవాగ్రం కేంద్రంగా ప్అని చేస్తూ 1980లో శుభా స్వర్గస్తులయ్యారు. జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కొరకే పాటు పడ్డ వారు మనకు నిత్య స్మరనీయులు.
ఆచార్య వినోబాభావే

వినోబాభావే మనదేశంలో చాలా తక్కువమందికి తెలిసిన పేరు. గొప్ప పనులు చేసి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి మొత్తం జీవితాన్ని సత్యం, అహింస, గో సేవ ,అంకితం చేసిన మహనీయుడు వినోబా భావే. ఈరోజు ఆయన జన్మదినం, స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ పిలుపుమేరకు పాల్గొని గాంధేయ సిద్ధాంతాలను జీవితాంతం ఆచరించిన వ్యక్తి వినోబా భావే. స్వాతంత్రం రాక ముందు దేశంలో గాంధీ ప్రవచించిన సిద్ధాంతాలను స్వాతంత్రం వచ్చిన తరువాత అమలు చేయడానికి జీవితాంతంకృషి వ్యక్తుల్లో వీరు ముఖ్యులు. స్వాతంత్రం వచ్చిన తరువాత సంస్థానాల విలీనం సమయంలో నిజాం కు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం పేరుమీద కమ్యూనిస్టులు చేసిన పోరాటాన్ని విమోచన అయిన తరువాత కూడా కొనసాగించడం దేశ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.సాయుధ పోరాటం పెరు మీద జరుగుతున్న దేశ వ్యతిరేక పోరాటాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాకుండా భారత ప్రభుత్వం ఉన్న సమయంలో వినోబాభావే దేశంలోని భూమి హీనులు నిరుపేదలు వ్యవసాయ కూలీల గురించి పోరాటం చేయాలని ఆలోచన చేశారు. దేశంలోని భూమి అంతా కూడా జమిందార్లు,జాగీర్దార్లు, భూస్వాముల చేతిలో భూమి బందీ అయిన విషయాన్ని గుర్తించిన వినోబా భూమిలేని వారికి భూమి ఇప్పించే విషయం ఆలోచించి ఆ పనిని ముందుకు నడపడానికి భూదానోద్యమాన్ని ప్రారంభం చేశారు . ఆ ఉద్యమానికి నాంది మన తెలంగాణలోని పోచంపల్లి అందుకే దానిని భూదాన్ పోచంపల్లి అన్నారు. దీనిని భూదాన గంగోత్రి అని కూడా అంటారు. ఆ గ్రామంలోని వెదిరేరామచంద్ర రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన భూమి భూదాన ఉద్యమానికి నాంది . అలా ప్రారంభమైన ఉద్యమం మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగింది. పాదయాత్ర ద్వారా ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్లి గోసేవ, గోపూజ అనంతరం భజన, కార్యక్రమం ముగింపు లో ఆ ఊర్లో భూమిలేని వాళ్లు ఎవరు అని అడిగే వారు.
– వట్టిపల్లి శ్రీకాంత్