‘సోషల్ మీడియా ద్వారా భారతీయ సంస్కృతి, చరిత్ర పట్ల అవగాహన’ అంశం మీద జరిగిన సమాలోచనలో భాగంగా మాట్లాడిన ప్రముఖ సోషల్ మీడియా కార్యకర్త శ్రీమతి పద్మ పిళ్ళై, చరిత్ర వక్రీకరణ వంటి సోషల్ మీడియా దాడులను ఎదుర్కోవాలంటే అందరూ నిజమైన చరిత్ర పట్ల అవగాహనా కలిగి ఉండాలని, అప్పుడే ఈ విధమైన దాడులకు సరియైన ఆధారాలతో సహా ధీటైన సమాధానాలు ఇవ్వగలుగుతామని తెలిపారు.