హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థులు ఆందోళన

FacebookTwitter

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు రెండు నెలల సెలవుల  తరువాత తిరిగి విధుల లోకి చేరడం తీవ్ర ఉద్రిక్తత కు దారి తీసింది. ప్రభుత్వం వెంటనే రోహిత్ వేముల ఆత్మ హత్య పై ఆరోపణలు ఎదుర్కుంటున్న వైస్ ఛాన్సలర్ ని సస్పెండ్ చేయాలి అనే డిమాండ్ తో వి.సి  ఛాంబర్ లోకి వెళ్లి ఫర్నిచర్ ద్వంసం చేయడం జరిగింది. పరిస్థితి లో మార్పు ను గమనించిన యూనివర్సిటీ అధికారులు పోలీస్ వాళ్ళకు సమాచారం ఇవ్వడం తో అక్కడకు చేరుకొని ఉద్త్రిక్త వాతావరణాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా విద్యార్తులు ఘర్షణకు దిగడం తో పోలీస్ లో లాఠి ఛార్జ్ చేసారు. ఈ ఆందోళన మద్య ఒక పోలీస్ అధికారికి తలకు గాయం జరిగింది.  పోలీస్ వాళ్ళు రక్షణగా ఉండి  వైస్ ఛాన్సలర్ అక్కడనుండి తప్పించి, కొంత కాలం పాటు యూనివర్సిటీ కి దూరంగా ఉండాలి అని సలహా ఇచ్చినట్టు సమాచారం.

 

FacebookTwitter