ఎస్. గురుమూర్తి గారు, వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్, RSS ఆలోచన పరుడు (ఆయన సంస్థలో ఎలాంటి అధికారిక పాత్ర కలిగి ఉండనప్పటికీ) పరిశోధనాత్మక వ్యాస రచయిత మరియు శక్తివంతమైన వ్యాపార సలహాదారుడు.
తన ఆధ్యాత్మిక గురువు సలహా మేరకు ఎన్నికల రాజకీయాల చెత్తని ఏరి వేయడానికి నిశ్చయించుకుని భారతీయ రాజకీయాలు మరియు వ్యాపారాలపై తన అత్యంత ప్రభావవంతమైన స్వరాన్ని వినిపిస్తున్నారు . అనేక మందికి RSS యొక్క ఆర్ధిక మరియు వ్యాపార సంబంధిత విషయాలపై గురుమూర్తి గారి ముద్ర బాగా కనిపిస్తుంది. ఆర్.బి.ఐ గవర్నర్ రఘురామ్ రాజన్ న్నిష్క్రమణ కోసం సంఘ పరివార్ నాయకులలో ఒక విభాగం ఇటీవల చేసిన డిమాండ్ వెనుక స్వదేశీ జాగరణ్ మంచ్ (SJM), సహ కన్వీనర్ అయినా గురుమూర్తి గారు కూడా ఒక స్ఫూర్తి.
ప్రవీణ్. ఎస్. తంపి కు యిచ్చిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ లో, గురుమూర్తి గారు తన పోరాటం వ్యక్తులకు వ్యతిరేకంగా కాదని వాదించారు. జ్ఞాన సముపార్జనకై బయట దేశాల్లో నివాసముంటున్న భారతీయ నిపుణులు భారతదేశం యొక్క విధి విధానాలను రూపొందించే ముందు భారతదేశంలో కొంతకాలం ఉండి దేశ స్థితిగతులను సమగ్ర అధ్యయనం చేస్తే బావుంటుంది. (ఎలాగైతే దక్షిణ ఆఫ్రికా నుంచి వచ్చిన గాంధీజీ గోపాలకృష్ణ గోఖలే సలహా తీసుకున్నట్లు ).
ఈ అరుదైన ఇంటర్వ్యూలో నుండి అంశాలు:
పెరుగుతున్న FDI పెట్టుబడులు భారతదేశ బహుళ ప్రయోజనాలపై ఆసక్తా ? లేక విదేశీ పెట్టుబడిదారుల ( విదేశీ ఆయుధాల సప్ప్లై మరియు పౌర విమానయానాల లాంటి ) కు ప్రయోజనాలు చేకూర్చేవా ?
దీనిపై కొంత చర్చ అవసరం. FDI తెరవబడడం ఆర్ధికంగా మరియు వ్యూహాత్మకంగా జరిగింది. 1990-1995 మధ్యలో ఇది నెరవేరలేదు. తప్పనిసరిగా అవసరమైన డాలర్లు పొందడానికి నిస్సహాయంగా ఉండి ఏ వ్యూహాత్మక అవకాశం లభించలేదు. 1998 పోక్రాన్ అణుపరీక్ష భారత దేశాన్ని మొట్ట మొదట సారిగా ప్రపంచ దృష్టికి తీసుకునివచ్చింది. భారతదేశం పై ఆంక్షలు విధించ బడ్డాయి. శక్తివంతమైన పాశ్చాత్య దేశాలు భారతదేశం తో సంప్రదింపులకు తెరతీశాయి. 2000 సం. ప్రారంభం నుంచి కూడా అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితి ని ఎదురుకుంటుంటే ఆసియా ఖండంలోని దేశాలకు కొంత ఆర్ధిక అభివృద్ధి వేగాన్ని పుంజుకున్నాయి . Dr .మన్మోహన్ సింగ్ గారి నేతృత్వం లో భారతదేశం-అమెరికా కుదుర్చుకున్న అణుఒప్పందం విశేషమైన వ్యూహాత్మక చర్య. ఇప్పుడు మోడీ నేతృత్వంలో భారత దేశ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం వలన భారత దేశం యొక్క ప్రాముఖ్యత ప్రపంచ చిత్రపటంలో గణనీయంగా పెరిగింది .
దీని యొక్క పరిణామమే 2016 భారత దేశ పరిస్థితికి 1996 లో భారత దేశ పరిస్థితికి తేడాను మనం స్ఫష్టంగా చూడగలుగుతున్నాము. ఇప్పుడు మనం ఎంతటి పెద్ద దేశంతో నైనా ఆర్ధిక వ్యూహాత్మక సంబంధాలు ఏర్పరచుకోగలం. కాబట్టి ఇప్పుడు ‘Make in India’ మరియు ‘Made in India’ తో కూడిన FDI పెట్టుబడులను మనం ఆర్ధికంగా వ్యూహాత్మకంగా చూడగలం.
వ్యాపారము మరియు పెట్టుబడులు బేరీజు వేసుకున్నప్పుడు దిగుమతులు కన్నా FDI మంచి ఎంపిక. ఆటొమొబైల్ ను FDI అనుమతించడం వలన భారతదేశాన్ని ఒక ఎగుమతి కేంద్రం గా చేసింది. ఇటీవల FDI విధానాలతో రెండు విషయాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొదటిది , ఎయిర్ ఇండియా భవితవ్యాన్ని నిశ్చయించకుండా పౌర విమానయాన రంగం లోకి FDI ను అనుమతించడం. రెండు, దేశీయ ఆహార విక్రయ సంస్థలను బలపడడానికి సమయం ఇవ్వకుండా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం. కొత్త విధానాల వలన భారత దేశ ఆయుధాల తయారీ పరిశ్రమను బలపరచి ప్రపంచ ఆయుధ వ్యాపార దిగ్గజంగా నిలిచే అవకాశం ఉంది.
మీరు నరేంద్రమోడీ ప్రభుత్వ ఆర్థిక సంస్కరణల అజెండాను బిజెపి, SJM అనుసరిస్తున్న ‘భారతీయతను‘ సిద్ధాంతానికి తగినట్లుగా ఉందని అని భావిస్తున్నారా?
ఇక్కడ భారతీయత అంటే ఒక గిరిగీసుకుని ఉండటం కాదు . భారతీయత అంటే భారత దేశానికి అనుకూలంగా సమతుల్యతను కలిగి ఉండటం. ఇక్కడ “సంస్కరణ” అనే పదం కన్నా “మార్పు” అనే పదాన్ని ఇష్టపడతాను. 1990 లో అమెరికా యొక్క అనియంత్రిత ఆర్ధిక విధానం ఒక్కప్పుడు ప్రపంచ దేశాలకు కొలమానం, కానీ ఇప్పుడు అమెరికానే నియంత్రిత ఆర్ధిక విధానంపై మొగ్గు చూపుతోంది. మార్పు అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఆర్థికవేత్తలు దీనిని అర్థం చేసుకుంటే అనేక అపార్ధాలను తొలగించవచ్చు.
సుబ్రమణ్య స్వామి గారు “రఘు రాంరాజన్ మానసికంగా పూర్తిగా భారతీయుడు కాదు” అన్న ఆయన వ్యాఖ్యలతో అంగీకరిస్తున్నారా? మీకు RBI గవర్నర్ తో ప్రాధమిక విభేద కారణాలు ఏమి ఉన్నాయి?
నా ప్రధాన విభేదం ఆయన విధానాలు. జ్ఞాన సముపార్జనకై ఎక్కువ కాలం విదేశాలలో ఉన్న భారతీయ నిపుణులు భారతదేశం యొక్క విధి విధానాలను రూపొందిచే ముందు మొదట భారతదేశంలో కొంత కాలం ఉండి భారత దేశ స్థితి గతులను సమగ్ర అధ్యయనం చేస్తే (ఎలాగైతే దక్షిణ ఆఫ్రికా నుంచి వచ్చిన గాంధీజీ ,గోపాల కృష్ణ గోఖలే గారి సలహాను తీసుకున్నట్లు) బాగుంటుంది అని నా అభిప్రాయం.
కొన్ని సంవత్సరాల క్రితం ఆర్థిక సలహాదారుడు అరవింద్ సుబ్రహ్మణ్యం గారు మేధో సంపత్తి హక్కులు మీద భారత దేశానికి వ్యతిరేకంగా వాషింగ్టన్ కు మద్దతుగా వ్యవహరించినట్టుగా తెలుపుతూ అరవింద్ సుబ్రహ్మణ్యం ను తొలగించాలని స్వామి డిమాండ్ చేశారు. మీరు స్వామితో అంగీకరిస్తున్నారా ?
నేనుఅంగీకరించను. అరవింద్ సుబ్రహ్మణ్యం నేడు అదే అభిప్రాయంతో ఉన్నారని నేను భావించడంలేదు. అతను అలాంటి పని చేసి ఉంటే, మోడీ ప్రభుత్వంలో ఉండే వారే కాదు.
సాంకేతిక నిపుణలకు భారతీయత అనే అంశం వారి ఉద్యోగ నిర్వహణలో ఎంత వరకు సంభందిత అంశం?
భారతీయత అంటే భారతీయమైన మనసు అని అర్థం. భారతదేశం పట్ల ప్రేమ మరియు భారత దేశం యొక్క అనుభవం – ఇది రెండు అంశాలను కలిగి ఉంది. ఒకటి లేకుండా మరొకటి లేదు . జవహర్ లాల్ నెహ్రు నికోలస్ కల్దర్ ను తీసుకున్నట్లుగా , ఒక పర్యాయం సలహాదారులుగా విదేశీ సాంకేతిక నిపుణులు తీసుకోవచ్చు – (ఎంపిక తప్పు అయినప్పటికీ). విదేశీ సాంకేతిక నిపుణులు యొక్క సలహా సరిపోయేందుకు ఉంటుంది లేదో మాత్రమే ఒక భారతీయమైన మనసు నిర్ణయిస్తుంది. డెంగ్జియావోపింగ్ అన్ని ఆలోచనలు పరిశీలించడానికి ఒప్పుకున్నాడు కానీ ఏ ఆలోచన చైనాలో పనిచేస్తుందో అది మాత్రమే తీసుకోవాలని ఆయన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోడీ ప్రభుత్వం NITI Aayog కి ఇచ్చిన సలహాలో భారత దేశానికి మరియు భారత దేశం పని చేసే విధానాలను మాత్రమే పరిగణించాలి . సూచనలు అందరి నుంచి తీసుకోవచ్చు కానీ అవి భారత దేశానికి ఎంత వరకు సరి పోతాయో లేదో భారతీయ అనుభవం ఉన్న వారు మాత్రమే నిర్ణయించగలరు.
మీ దృష్టిలో రాజన్ స్థానంలో ఆదర్శ అభ్యర్ధి ఎవరు ? తదుపరి ఆర్.బి.ఐ గవర్నర్ కు ఎలాంటి లక్షణాలు ఉండాలి ?
మనకు ప్రముఖులు ఎవరు అవసరం లేదు. మనకు RBI గవర్నరు అయ్యాక ప్రముఖుడైన డాక్టర్ Y.V.రెడ్డి లాంటివారు , లోతుగా భారత దేశ స్థితిగతులు తెలిసిన వారు మరియు తలవంచి పని చేసేవారు కావాలి .
ఆర్థిక సరళీకరణ ప్రారంభమైనప్పటి నుండి ఈ 25 సంవత్సరాలలో, భారతదేశం యొక్క ఆర్థిక స్థితి సంబంధించినంత వరకు ఒక గ్లాస్ తో పోలిస్తే మరొక గ్లాస్ ను ఎలా చూస్తారు , సగం పూర్తిగానా లేక సగం ఖాళీగానా ?
దీని సమాధానం మీ మొదటి ప్రశ్న కే చెప్పాను. మనం భారత దేశం యొక్క ఆర్థిక స్థితిని మరియి మన వ్యూహాత్మక స్థితిని విడివిడిగాచూడలేము. ఈ రెండు కలిస్తేనే ఒక దాని కొకకటి బలం చేకూరుస్తాయి. నేను భారతదేశం ఈ రెండు విషయాలలో బాగా ఉన్నత స్థాయికి చేరుకుందని అనుకుంటున్నాను.
రామ్ దేవ్ బాబా వంటి వారు బాబా నుంచి వ్యాపారవేత్తగా పెరగడాన్ని మీరు ఎలా పరిగణిస్తారు ? మీ ఉదేశ్యంలో వారు HUL మరియు పి&జీ లాంటి భారీ పరిశ్రమలకి పోటీని ఇవ్వగలరా?
రామ్ దేవ్ బాబా వ్యాపార విజయం వలన మనకు స్వదేశీ వస్తువులపై ఉన్న ఆర్ద్రత, ఆకర్షణ తెలుస్తోంది. దీని వల్ల బహుళ జాతి సంస్థలు కూడా మారుతున్నాయి. కోల్గేటు వారి ప్రకటన చూసినట్లయితే వాళ్ళు పేస్టలో ఉన్న వేప ఉప్పు శాతం గురించి మాట్లాడుతున్నారు.
కంపెనీలు మరియు వాటి ఆర్ధిక అంశాలలో మీకున్న అవగాహనతో చాలా బాగున్నా జీడీపీ గణాంకాలను చూస్తే మీకు ఎలా అనిపిస్తోంది?
నాన్ కార్పోరేట్ రంగం ,దేశీయ వినియోగం మరియు పొదుపు భారత దేశం యొక్క అభివృద్ధికి ముఖ్య కారణాలు. కార్పోరేట్ రంగం పూర్తిగాఎప్పుడు భారత దేశ అభివ్రుదికి కారణం కాదు . ‘క్రెడిట్ సుస్సి’
అధ్యయనం చెప్పినట్టు కార్పోరేట్ సంస్థలు భారత దేశ ఆర్ధిక వ్యవస్థ యొక్క తోక మాత్రమే. కానీ శరీరం కాదు .కానీ బహుళ జాతి సంస్థలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో భారత దేశాన్ని అనుసంధానం చేస్తున్నాయిల , 2008 కి ముందు భారీగా పెట్టుబడులు పెట్టిన కార్పోరేట్ దిగ్గజాలు దెబ్బతిన్నాకా కూడా మూర్ఖంగా అదే వరవడిని కొనసాగిస్తున్నారు.
ఆచరణాత్మక పరిష్కారానికి పిలుపునిచ్చే అవసరం ఏర్పడింది. దీనికి విరుద్దంగా ఆర్.బి.ఐ భారత దేశనికి తగిన ఎన్.పి.ఏ నిబంధనలు బలవంతంగా ప్రవేశపెట్టింది .దీని వలన భారత దేశ కార్పోరేట్ రంగం దిగ్భ్రాంతి చెందింది. ప్రపంచ నిబంధనలను మూడు కారణాల వలన వాయిదా వేయవలసి వచ్చింది. మొదటిది ,భారత దేశంలో పెట్టుబడి వైపు పరివర్తనీయత, రెండవది బ్యాంకులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, మూడవది మూడో వంతు బ్యాంక్ డిపాజిట్లు ప్రభుత్వ సెక్యూరిటీ లలో పెట్టుబడి పెట్ట బడ్డాయి.
1990 లో జపాన్ మరియు 2008 లో అమెరికా లాంటి దేశాలలో బ్యాంకింగ్ సంక్షోభం ఏర్పడినప్పుడు ఇటువంటి చర్యలు చాలా సామాన్యంగా తీసుకోబడతాయి. కాబట్టి RBI ఈ విధానాన్ని ఎంత తొందరగా మార్చుకుంటే అంత మంచిది .
ప్రపంచీకరణ కాలం మరియు తాజాగా అమెరికా నుంచి యూకె వరకు అనుసరిస్తున్న రక్షణ విధానం నేపధ్యంలో స్వదేశీ ఎంత వరకు సమంజసమైన అంశం?
స్వదేశీ అన్నది వస్తు రక్షణ విధానం కాదు. సంస్కృతి మరియు అర్థ శాస్త్రలను అనుసంధానం చేసే తత్వ శాస్త్రం . అభివృద్ధికి “అన్నిటికి సరిపోయే” ( “fit all ”) విధానం సరి కాదు కాబట్టి అభివృద్ధి సంస్కృతి పరంగా అనుకూలంగా ఉంటుంది. నిజానికి ఇది భవిషత్తు ప్రపంచ ఆలోచన.
October 15-16 2005 న ఆర్ధిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ లు పాల్గొన్న జి-20 శిఖరాగ్ర సమావేశాల్లో “Fit all ” ఆర్ధిక విధానాన్ని తోసిపుచ్చారు.” ప్రతి దేశం తనకు తగిన అభివృద్ధి విధి విధానాలను ఏర్పరుచుకోవాలని తీర్మానించారు”.
తరువాత వరల్డ్ బ్యాంక్ 2008 న ఇదే విషయాన్ని సమ్మతించి ఇలా చెప్పింది ” వివిధ దేశాల్లో మన పని చూసాక వరల్డ్ బ్యాంక్ కూడా ఒకే పద్దతి అన్ని చోట్ల సరిపోదు అని అర్థం చేసుకుంది. అభివృద్ధి అంటే సర్వోత్తమమైన ఆలోచనలు తీసుకోవాలి , వాటిని కొత్త కొత్త పరిస్థితులలో పరీక్షించాలి మరియు సరిపోని వాటిని తోసిపుచ్చాలి”
2015 లో ఐక్య రాజ్య సమితి అధికారులు పేదరికం తగ్గింపు మరియు సమర్థవంతమైన వృద్ధి మీద సంస్కృతి యొక్క కీలక పాత్రను గుర్తించడం, మరియు అది 2015 తరువాత అభివృద్ధి ఎజెండాకు సంకలనముగా ఉండేలా చూడాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. కాబట్టి స్వదేశీ ఇప్పుడు ప్రపంచ ఆలోచనా లేక స్థానిక ఆలోచనా?
More Stories
మార్గదర్శి `కళాతపస్వి’
17,300 beds arranged in Isolation and covid care centers run by Seva Bharati
జాతీయపతాకాన్ని గౌరవిద్దాం