ప్రజాభిప్రాయ నిర్మాణంలో, సేకరణలో పాత్రికేయుల పాత్ర కీలకం – శ్రీ రాంపల్లి మల్లికార్జున్

నేటి ప్రపంచంలో పత్రికల్ స్థానం చాల గొప్పది. ప్రజాభిప్రాయ నిర్మాణంలో, ప్రజాభిప్రాయ సేకరణలో కీలక పాత్ర సమాచార రంగానిదే నని సమాజ సంక్షేమ కోసం ఆనాడే ఒక చక్కటి సమాచార వ్యవస్తను నిర్మాణం చేసిన మహానుభావులు ప్రపంచ మొదటి పాత్రికేయుడు నారదుడు అని, శ్రీ రాంపల్లి మల్లికార్జున్ రావు, లోకహితం మాస పత్రిక మాజీ ఎడిటర్, పేర్కొన్నారు.
FacebookTwitter

నేటి ప్రపంచంలో పత్రికల్ స్థానం చాల గొప్పది. ప్రజాభిప్రాయ నిర్మాణంలో, ప్రజాభిప్రాయ సేకరణలో కీలక పాత్ర సమాచార రంగానిదే నని సమాజ సంక్షేమ కోసం ఆనాడే ఒక చక్కటి సమాచార వ్యవస్తను నిర్మాణం చేసిన మహానుభావులు ప్రపంచ మొదటి పాత్రికేయుడు నారదుడు అని, శ్రీ రాంపల్లి మల్లికార్జున్ రావు, లోకహితం మాస పత్రిక మాజీ ఎడిటర్, పేర్కొన్నారు.

మల్లికార్జున్ గారి 2 మే నాడు కరీంనగర్ లోని స్థానిక ఫిలిం భవన్ లో జరిగిన విశ్వ సంవాద్ కేంద్ర , సమాచార భారతి ఆధ్యర్యంలో నిర్వహించిన నారద జయంతి సంద్భార్బంగా  ప్రధాన వక్త గా లోకకల్యాణం గురుంచి నారదుడు వివిధ సందర్బాలలో ఏ ఏ విధంగా సమస్యలను పరిష్కరించారో వివరించారు.

ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమంలో విదేశీ పత్రికలూ దారుణమైన బానిస భావజాలాన్ని వ్యాప్తి చేసాయని, అయితే మనదైన భావజాలం లో స్వదేశీ పత్రికలు ప్రారంభించి దేశ పౌరులలో స్వాతంత్ర్య కాంక్ష్య ను రగిలించి స్వతంత్ర సముపార్జనకు ప్రధాన భూమిక మన దేశీయ పత్రికలి పోషించాయని తెలిపారు. ఈనాడు పత్రికలూ విదేశీ భావ జాలపు మోహంలో కొట్టుకొని పోతున్నాయని అది భవిషత్తు కు మంచిది కాదని వివరిస్తూ, ఈ దేశ ధార్మిక, సాంస్కృతిక, సామజిక విలువలతో కూడిన పాత్రికేయ విలువలను పెంపొందింప చేసుకొని ముందుకు పోవాలని దేశ భక్తీ నిర్మాణంలో పత్రిక రంగం కీలక పాత్ర పోషిస్తుందని, పాత్రికేయులు ఆ దిశగా కృషి చేయాలని కోరారు.

సభాధ్యక్షులు గా పాల్గొన్న డా గండ్ర లక్ష్మణ్ రావు మాట్లాడుతూ నారదుడు ఆనాటి గొప్ప పాత్రికేయుడు అని, వారి పాత్రికేయత్వం సమాజ సంక్షేమం కోసం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం వినియోగించబడిందని నేటి పత్రికలూ  నారదుడుని స్పూర్తిగా తీసుకొని సమాజ హితమే లక్ష్యంగా పని చేయాలనీ పిలుపునిచ్చారు.

ఆత్మీయ అతిధి గా పాల్గొన్న శ్రీ బూర్ల దక్షిణ మూర్తి గారు మాట్లాడుతూ ఒక పత్రిక వేల సైన్యం తో సమానమని అందువలన పత్రిక పూర్తి సమాచారం లో సమ్యక్ దిశలో నడువాల్సిన అవసరం ఉందని వార్తలు రాయడంలో నిజాయితితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసారు.

గౌరవ అతిధి టి యు డబ్ల్యు జే అధ్యక్షులు శ్రీ తాడూరి కరుణాకర్ గారు మాట్లాడుతూ పాత్రికేయ వృత్తి అనేది కత్తి మీద సాము లాంటిదిని విలేఖరులు నిత్య సంరక్షనతో నిజాయితిగా వార్తలను అందిస్తూ సమాజ జగరణలో పాలు పంచుకుంటున్నారని , పత్రికలూ ఎవరికీ వత్తాసు పలకకుండా కేవలం వాస్తవాలను మాత్రమే ప్రసారం చేస్తాయని, ఇలాంటి విషయాలో నారదుడు ఉత్తమ పాత్రికేయుడని  కొనియాడారు.

టి యు డబ్ల్యు జే కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సమ సమాజ నిర్మాణంలో పత్రికల పాత్ర ఎనలేనిదని  నేడు పత్రికలు అత్యంత ప్రభావశీలమైనదని వారు పేర్కొన్నారు .

ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు శ్రీ పింగిలి వెంకట రమణ రెడ్డి, శ్రీ ఎలగందుల సత్యనరయన్, శ్రీ గాజుల రవీందర్, శ్రీ కొట్టే మురళి కృష్ణ, కుమ్మరి కుంట సుధాకర్, బొంతుల కల్యంచంద్ర, కట్టి శ్రీకాంత్, మల్లోజుల కిషణ్ జి, గార్ల సంపహ్ట్ , గుండు రమేష్, నవీన్, సంజీవ్ రెడ్డి, కుంటు మల్లేష్, తోట రాజేందర్ తో పాటు వివిధ పత్రికల పాత్రికేయులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

FacebookTwitter